telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ హీరోల గురించి సంచలన కామెంట్స్ చేసిన మంచు విష్ణు…

Manchu-Vishnu

కరోనా కారణంగా ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్న మంచు విష్ణు ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తోటి హీరోలపై సరదాగా విరుచుకుపడ్డారు. గోపీచంద్, నితిన్, సుమంత్ లాంటి హీరోలతో మంచి ఫ్రెండ్‌షిప్ ఉన్న మీకు వాళ్ళతో మల్టీస్టారర్ సినిమా చేయాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదా? అని యాంకర్ వేసిన ప్రశ్నకు మంచు విష్ణు దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. నితిన్, కళ్యాణ్ రామ్‌లకు ఇప్పటికే నాలుగు సినిమాలు ఆఫర్ చేశానని, వాళ్లిద్దరూ పెద్ద రాస్కెల్స్ అని అన్నారు విష్ణు. ఇక సుమంత్ ఎక్కడైనా కనిపిస్తే గొంతు పిసికేయాలని చూస్తున్నా. నేను చేసే ‘మోసగాళ్లు’ సినిమాలో నటించమని అడిగినా ఆయన కాదన్నాడు. పైగా ఆ క్యారెక్టర్ నచ్చలేదని సాకు చెప్పాడని విష్ణు పేర్కొన్నారు. ‘ఈడో రకం ఆడో రకం’ సినిమా కోసం మొదట కళ్యాణ్ రామ్‌నే అడిగానని మంచువిష్ణు తెలిపారు. ఇకపోతే నితిన్‌తో కలిసి ఓ సినిమా చేయాలని గత పది, పన్నెండేళ్లుగా ట్రై చేస్తున్నా. ‘దోస్తానా’ సినిమా చేయాలని చాలాసార్లు అడిగా. కానీ ఇంకా పెండింగ్ లోనే ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మంచు విష్ణు ‘మోసగాళ్లు’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా చేస్తూనే నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్నారు. చరిత్రలో అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ మిస్టరీని కథాంశంగా తీసుకొని హాలీవుడ్-ఇండియన్ మూవీగా ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం.

Related posts