telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మామిడిపళ్ళతో మజా చేస్తోన్నచార్మి…

charmi on her offers and root map

లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్, పరిశ్రమలు అన్నీ మూతపడ్డాయి. సాధారణ ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల దాకా గడపదాటి అడుగు బయటపెట్టడం లేదు. ఈ క్రమంలో కుటుంబంతో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఎవరికి తోచిన పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే సినీ నటి ఛార్మి మాత్రం మామిడి పళ్ళు తింటూ ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ మేరకు సదరు వీడియో పోస్ట్ చేస్తూ ‘ఈట్ ఎన్ ఈట్ ఎన్ ఈట్’ అంటూ స్మైలింగ్ ఎమోజీలను ట్యాగ్ చేసింది. అంతేకాదు ఈ లాక్‌డౌన్‌లో అందరూ ఇంట్లోనే ఉండండి అని పేర్కొంది. ఛార్మి పెట్టిన ఈ ట్వీట్ చూసి ”జాగ్రత్త మేడమ్, ఇంకా బొద్దుగా అవుతారు, మామిడి పండ్లు మీకెక్కడ దొరికాయి మేడమ్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. పూరి జగన్నాథ్‌తో కలిసి సినిమాల నిర్మాణంలో భాగమవుతోంది ఛార్మి. ఇటీవలే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో భారీ హిట్ రాబట్టి లాభాలు గడించిన ఈ ఇద్దరూ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ‘ఫైటర్’ మూవీ రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.

Related posts