కరోనా లాక్డౌన్ అమలు అవుతున్న సమయంలో బీహార్ లో 11 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నామని బక్సర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉపేంద్రనాథ్ వర్మ తెలిపారు. 11 మంది విదేశాలకు చెందిన తబ్లీగ్ జమాత్ సభ్యులు వీసా నిబంధనలను ఉల్లంఘించడంతో వారిని జైలుకు పంపించామని పేర్కొన్నారు.
తబ్లిఘి జమాత్ కార్యక్రమానికి హాజరైన పలువురికి ఇప్పటికే బీహార్ పోలీసులు పరీక్షలు నిర్వహించి..అనుమానిత లక్షణాలున్న వారిని క్వారంటైన్ కు తరలించారు. మరోవైపు వివిధ ప్రాంతాల్లో తబ్లిఘి జమాత్ లింకున్న వారి వివరాలు కూడా సేకరిస్తున్నారు. బీహార్ లోని సమస్తిపూర్ జిల్లాలోనూ 9 మంది బంగ్లాదేశీయులు వీసా నిబంధనలను ఉల్లంఘించి లాక్ డౌన్ సమయంలో తబ్లీగ్ జమాత్ మతప్రచారం సాగిస్తుండటంతో వారిపై కూడా కేసు నమోదు చేశారు.