telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

పాక్ పై గెలుపు తో.. హుషారుమీద ఉన్న కోహ్లీ..

kohli london tour on celebration of success

ప్రపంచ కప్ లో భాగంగా దాయాది పాక్ పై గెలిచిన టీమిండియా సభ్యులు ఆటవిడుపుగా, లండన్‌ వీధుల్లో సందడి చేస్తున్నారు. పదిహేను రోజులపాటు భార్యా పిల్లలతో గడిపేందుకు బీసీసీఐ అనుమతించడంతో కెప్టెన్‌ కొహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తదితరులు తమ భార్యా, పిల్లల్ని వెంటేసుకుని సరదాగా గడుపుతున్నారు.

భారత్‌ తదుపరి మ్యాచ్ లో ఆప్ఘనిస్థాన్‌తో తలపడనుంది. ఈ మధ్యలో ఐదు రోజులపాటు విరామం ఉండడంతో సభ్యులకు కలిసి వచ్చింది. రెండు రోజుల పాటు ఆటగాళ్ల ప్రాక్టీస్‌ను కూడా రద్దుచేసి విరామం ఇచ్చారు. లండన్‌లోని ఓల్డ్‌బాండ్‌ స్ట్రీట్‌లో కొహ్లీ, అనుష్క జంట కనిపించడంతో అభిమానులు తమ కెమెరాలకు పనిచెప్పారు. రోహిత్‌, ధావన్‌లు కుటుంబాలతో గడుపుతున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Related posts