telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బ్రేకింగ్ : ఏలూరు ఆస్పత్రికి జగన్‌.. బాధితులకు పరామర్శ

ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి ఏపీ సీఎం జగన్‌ ఇవాళ ఉదయం వెళ్లారు. అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న బాధితులను సీఎం జగన్‌ పరామర్శిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించిన జగన్‌.. బాధిత కుటుంబాలకు భరోసా కల్పించారు. సీఎం జగన్‌ వెంట మంత్రి పేర్నినాని, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. బాధితుల పరామర్శ అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు సీఎం జగన్. కాగా.. ఏలూరులో అస్వస్థతకు గురవుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. నగరంలోని పది ప్రాంతాలకు చెందిన వారు… స్పృహ కోల్పోవడం, మెడ, నడుం నొప్పి, తల కళ్లు తిరగడం లాంటి లక్షణాలతో శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం రాత్రి వరకు ఆస్పత్రులకు వస్తూనే ఉన్నారు. వారు చెబుతున్న లక్షణాలనున బట్టి డాక్టర్లు చికిత్స అందిస్తుండటంతో బాధితులు కోలుకుంటున్నారు. అయితే.. ఒక్కసారి ఇంత మంది ఇలా అస్వస్థతకు గురవడానికి కారణాలేంటో ఇప్పటికి స్పష్టత రాలేదు. శనివారం అర్ధరాత్రి వరకు 108 మంది ఆస్పత్రిలో చేరగా… ఇవాళ ఉదయం వరకు ఆ సంఖ్య కాస్త 350 కి చేరుకుంది.

Related posts