telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

అస్వస్థతకు గురైన భక్తుడు.. తిరుమలలో కరోనా భయం!

tirumala temple

దేశవ్యాప్తంగా అనేక పుణ్యక్షేత్రాల్లోనూ కరోనా కలకలం కనిపిస్తోంది. తాజాగా, తిరుమల క్షేత్రంలోనూ కరోనా ఆందోళనలు రేగాయి. శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఓ భక్తుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మహారాష్ట్రకు చెందిన ఆ భక్తుడు వారణాసిని సందర్శించిన అనంతరం తిరుమల వచ్చాడు.

ప్రస్తుతం అతడు తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఆ భక్తుడిని తిరుమలలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అటు, తిరుపతి అలిపిరి వద్ద చెక్ పోస్టును మూసివేసి, తిరుమలకు వాహనాలను నిషేధించినట్టు తెలుస్తోంది. చెక్ పోస్టు మూసివేతతో అలిపిరి వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Related posts