కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్యే కారణమని మాజీ ప్రధాని దేవెగౌడ ఆరోపించారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ రాజీనామా చేసిన 12 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలంతా ఆయన సన్నిహితులేనని చెప్పారు. మరోసారి సిద్ధరామయ్యను కర్ణాటక ముఖ్యమంత్రిని కానివ్వనని దేవెగౌడ వ్యాఖ్యానించారు.
సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేస్తే రాజకీయ సంక్షోభం ముగుస్తుందని, ఇదే విషయాన్ని రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు కూడా చెబుతున్నారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయనను మళ్లీ సీఎంను కానివ్వబోమని చెప్పారు. కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చేందుకే సిద్ధరామయ్య తన సన్నిహిత ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించారని అన్నారు.
ఈవోని మంత్రి వెనకేసుకొస్తున్నారు: దేవినేని ఉమ