ఆంధ్రప్రదేశ్ లో ఉరవకొండ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని ప్రకటించారు.
మరోవైపు ఈ ఘటనపై ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. రహదారి భద్రత విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని గవర్నర్ సూచించారు.
ఆదివారం వివాహ వేడుకకు వెళ్లివస్తుండగా అనంతపురం – బళ్లారి జాతీయ రహదారిలోని బూదగవి – కొట్టాలపల్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీ కారును వేగంగా ఢీకట్టడంతో కారులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పలువురు నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ తిట్లపై పవన్ సంచలన వ్యాఖ్యలు!