“బాహుబలి” తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది. కళ్లు చెదిరే విజువల్స్తో, అద్భుతమైన కథతో, భారీ బడ్జెట్తో తెరకెక్కిన `బాహుబలి` సినిమాలు భారత్లోనే కాకుండా పలు ఇతర దేశాల్లో కూడా కలెక్షన్ల వర్షం కురిపించాయి. తాజాగా “బాహుబలి-ది బిగినింగ్” చిత్రాన్ని లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు దర్శకుడు రాజమౌళితోపాటు ప్రభాస్, రానా,అనుష్క, కీరవాణి, శోభూ యార్లగడ్డ హాజరయ్యారు. చిత్ర ప్రదర్శన అనంతరం ప్రభాస్ ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. “బాహుబలి కంటే ముందు తెలుగు సినిమాలేమైనా దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో ప్రభావం చూపించాయా?” అని ప్రభాస్ను విలేకరి ప్రశ్నించారు. దీనికి స్పందించిన ప్రభాస్.. “30 సంవత్సరాల కిందట రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘శివ’ సినిమా దేశవ్యాప్తంగా తెలుగు సత్తాను చాటింది. అయితే ‘బాహుబలి’ అంతకుమించి దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిందని, విదేశాల్లోని ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది” అని ప్రభాస్ చెప్పాడు.