మోదీ చేతుల్లోనే దేశం భద్రంగా ఉంటుందని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి ముస్లిం, క్రైస్తవ దేశాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ఇందుకోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నాయని చెప్పారు. ప్రధాని మోదీ దేశ సంక్షేమం కోసం పాటుపడుతున్నారని రాందేవ్ వ్యాఖ్యానించారు.
దేశ అభివృద్ధి కోసం మోదీ 24 గంటలు పనిచేస్తూన్నారని అన్నారు. ఎలాంటి స్వప్రయోజనాల కోసం ఆయన పని చేయలేదన్నారు. ఆయన చేతుల్లోనే దేశం భద్రంగా ఉంటుంది. ఆయన పాలనలో అందరికి రక్షణ భరోసా ఉంటుందన్నారు. మోదీ కీ కుటుంబం లేదు. సొంత ఇల్లు లేదు. అలాంటి ఆయనకు మనమంతా మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.