telugu navyamedia
రాజకీయ

ఉక్రెయిన్‌లో విద్యార్ధులు అవ‌స్థ‌లు: భారతీయులతో బయల్దేరిన విమానం

*భారతీయుల తరలింపు వేగవంతం..
*ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్ధులు ఉక్కిరిబిక్కిరి..
*ఉక్రెయిన్‌లో విద్యార్ధులు అవ‌స్థ‌లు..
*రొమేనియాలోని 219 మందితెలుగువిద్యార్ధులుతో బయల్దేరిన విమానం

*రేపు సాయంత్ర 6.40నిముషాల‌కి ముంబాయికి తెలుగువిద్యార్ధులు

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపును విదేశాంగాశాఖ వేగవంతం చేసింది. ఉక్రెయిన్‌ సరిహద్దుల నుంచి రొమేనియా రాజధాని బుఖారెస్ట్‌కు చేరుకున్నారు భారతీయ విద్యార్ధులు. ప్రత్యేక బస్సుల్లో విద్యార్ధులను ఎయిర్‌పోర్ట్‌కు తరలిస్తున్నారు. ఇప్పటికే రొమేనియా సరిహద్దులకు చేరుకున్న 219 మందితో తొలి విమానం ముంబయికి బయల్దేరినట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ట్విట్టర్​లో వెల్లడించారు.

Image

అందరినీ సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు అహర్నిశలు పనిచేస్తున్నట్లు తెలిపారు. స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. భారతీయుల తరలింపులో మంచి సహకారం అందించిన రొమానియా విదేశాంగ శాఖ మంత్రి బోగ్దాన్​ అరెస్కూకు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts