telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఆంధ్రప్రజల హక్కుల కోసం పోరాటం: నటి దివ్వవాణి

Actor Divyavani  Wishes Minister Lokesh
సోమవారం ఏపీ భవన్‌ ప్రాంగణంలో చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షలో సినీనటి దివ్వవాణి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ 
ఈరోజు ఆంధ్రప్రజలు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారని. మోదీ తాత సొమ్మేమీ అడగడంలేదని వ్యాఖ్యానించారు.  న్యాయానికి ప్రతీకగా ప్రజలంతా తమ కుటుంబాలను కాదనుకొని, చంద్రబాబు చేస్తున్న దీక్షకు మద్దతు తెలుపుతూ ఇక్కడికి వచ్చారని అన్నారు. 
మోదీ.. నీ వేలుతో నీ కన్నును పొడుచుకుంటున్నావని ఆమె అన్నారు.  ఇక్కడ జరుగుతున్న ధర్మపోరాటం.. చంద్రన ధర్మపోరాటమని ఆమె అభివర్ణంచారు.  నిన్న గుంటూరులో మోదీ సభకు వైసీపీ ఇచ్చిన బిర్యానీ, డబ్బులకు ఆశపడి వచ్చిన జనమని ఆమె ఆరోపించారు. ఇవాళ ఆంధ్రప్రజలు తమ హక్కుల కోసం  తమ కుటుంబాలను కాదనుకొని,  దీక్షకు మద్దతు తెలుపుతూ ఇక్కడికి వచ్చారని అన్నారు. 

Related posts