తమ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ టీడీపీ ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చింది. దీంతో పల్నాడు ప్రాంతం రాజకీయ ప్రకంపనలతో అట్టుడుకుతోంది. వైసీపీ కూడా టీడీపీకీ కౌంటర్ ఇచ్చేందుకు సిద్దమవుతుంది. టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ రేపు వైసీపీ కూడా “ఛలో ఆత్మకూరు” కు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఐజీని వైసీపీ నేతలు అంబటి రాంబాబు, బొల్లా బ్రహ్మనాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేశ్ కలిశారు. రేపు టీడీపీ, వైసీపీ లు పోటాపోటీగా “ఛలో ఆత్మకూరు” నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.