తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో దారుణం చోటు చేసుకుంది. దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఖైసర్నగర్లో రెండున్నరేళ్ల చిన్నారిపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. నిన్న సాయంత్రం ఇంట్లో ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా బాలిక గట్టిగా కేకలు పెట్టడంతో ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యాడు.
సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని పట్టుకున్న స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్యం చేయడం లేదంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.