సరిహద్దులోని తూర్పు లడఖ్లోని గాల్వన్ లోయ వద్ద భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ చెలరేగుతోంది. నిన్న రాత్రి నుంచి చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో ముగ్గురు భారత జవాన్లు మృతి చెందారు. దీంతో అక్కడ మరోసారి అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాల్వన్ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకొంది.
ఇరు దేశాల సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ముగ్గురు భారీతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఇరు దేశాల అగ్రశేణి ఆర్మీ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని భారత ఆర్మీ అధికారి ఒకరు ప్రకటన చేశారు.