telugu navyamedia
క్రైమ్ వార్తలు

నిన్న అదృశ్యమైన బాలుడు హ‌త్య‌..

చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలుడు తేజస్ రెడ్డి దారుణ హ‌త్య గురైయ్యాడు. అభం శుభం తెలియ‌ని చిన్నారిని పొట్ట‌న పెట్టుకున్నారు.

వివార్లాలోకి వెళితే
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో నిన్న అదృశ్యమైన బాలుడు… ఇవాళ బొప్పాయి తోటలో శవమై కన్పించాడు. దసరా పండక్కి అమ్మమ్మ ఇంటికొచ్చిన మనవడు ఇలా అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించడంతో అమ్మమ్మ ఊరైన కె.వి పల్లి మండలం ఎగువ మేకల వారి పల్లిలో విషాదం నెలకొంది.

తేజస్ తల్లిదండ్రులు నాగిరెడ్డి, జ్యోతి ఉపాధి కోసం కువైట్ కి వెళ్లారు. అప్పటి నుంచి పీలేరులో ఉన్న పెద్దమ్మ ఇంట్లో ఉంటూ తేజేష్ స్కూలుకు వెళ్తున్నాడు. పండుగ సెలవుల కావడంతో.. అమ్మమ్మ పార్వతమ్మ ఇంటికి వెళ్లాడు. నిన్న గుర్తు తెలియని దుండగులు బాలుడిని కిడ్నాప్ చేశారు. దీంతో కుటుంబసభ్యులు కె.వి పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు విచారణ చేస్తుండగానే.. ఇవాళ బొప్పాయి తోటలో బాలుడు శవమై కనిపించాడు. తేజస్‌ రెడ్డిని బంధువులే చంపారని స్థానికులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts