telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

వాహనాలు తనిఖీ చేస్తోన్న ఎస్సైను ఢీ కొట్టిన కారు… తీవ్రగాయాలు

Accident

వికారాబాద్ లోని నవాబ్ పేట్ ఎస్సై కృష్ణను ఓ కారు ఢీ కొట్టింది. వివరాల్లోకెళ్తే.. అనంతగిరిలో వాహనాలు తనిఖీ చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎస్సై కాలు నుజ్జునజ్జయింది. సడెన్‌గా జరిగిన ఈ ఘటనతో ఆయన తప్పించుకోలేకపోయారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఆయనను హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో కారును వేగంగా నడిపాడని పోలీసులు తెలిపారు.

ప్రమాదానికి కారణమైన వాహనదారుడిని, కారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న నిందితులు టోలీచౌక్ కు చెందిన ఇమ్రాన్, అన్వర్, నవీద్, సమీర్ గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts