తెలంగాణ ప్రజల్ని ఇంటిలిజెన్స్ అలర్ట్ చేసింది. నకిలీ ‘ఆరోగ్య సేతు’ యాప్ పేరుతో వచ్చే లింక్లు ఓపెన్ చెయ్యొద్దని సూచిస్తున్నారు. కేంద్రం రూపొందించిన ఆరోగ్యసేతు యాప్కు సంబంధించి కొందరు సైబర్ నేరగాళ్లు నకిలీ లింక్లను పంపిస్తున్నారని.. ఆరోగ్యసేతు లింకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ నిఘా విభాగం హెచ్చరించింది. ఆ లింకులన్నీ ఫేక్ అని.. వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ వాటిని క్లిక్ చేయొద్దంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నరని.. వారు జాగ్రత్తగా ఉండాలంటోంది. ఈ లింకులు పాక్ నుంచి సైబర్ నేరగాళ్లు పంపుతున్నారని.. ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగించే వారిని టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. మొబైల్కు వచ్చిన లింక్ను క్లిక్ చేస్తే ఫోన్లో ‘చాట్ మీ’ అనే యాప్ డౌన్లోడ్ అవుతోందని.. దీని ద్వారా ఫోన్లో ఉన్న సమాచారమంతా మాయం చేస్తారంటున్నారు. మొబైల్స్ను హ్యాక్ చేసే ప్రమాదం ఉందంటున్నారు. ఎలాంటి అనుమానం ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలంటున్నారు.
previous post
next post
అక్రమ సంబంధాలు సాధారణమే… దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు