telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీ కాంగ్రెసోల్లకు గుండెల్లో గుబులు పుట్టింది : హరిష్ రావు

దుబ్బాక ఉప ఎన్నికలో భాగంగా మంత్రి హరీష్ రావు రాయ పోల్ మండలం ఎల్కల్, బేగం పెట గ్రామాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ… తెరాస కి వస్తున్న ఆదరణ చూసి బీజేపీ కాంగ్రెసోల్లకు గుండెల్లో గుబులు పుట్టింది.. ఈరోజు రైతుల సంక్షేమం కోసం కృష్జి చేస్తున్న పార్టీ తెరాస ప్రభుత్వం అన్నారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం రైతుల బాయిల దగ్గర మీటరు పెడతాడట మరి మనం కూడా ఓటు తో బీజేపీ కి మీటరు పెట్టాలి అని సూచించారు. ఈరోజు అందరూ వస్తున్నారు ఓట్ల కోసము జనాల కష్టాలు తెలుసు, నాయకులు మొసలి కన్నీళ్లు కారుస్తూ వస్తున్నారు అని వారిని నమ్మొద్దు అని తెలిపారు. 1600 ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా అని అంటే ఎవ్వరు కూడా రావట్లేదని.. . లేకుంటే ముక్కు నేలకు రాస్తావ అని అంటే ఎవ్వరు రాడు అన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడ కూడా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారా.. కేసీఆర్ కిట్ కూడా బీజేపీ వాళ్ళు ఇస్తున్నాము అని అంటున్నారు.. ఇది కూడా పూర్తి అవాస్తవము, తప్పుడు అబద్దాలతో వస్తున్నారని కేసీఆర్ కిట్ తెరాస ప్రభుత్వం ఇస్తున్నది అని అన్నారు. ముడేండ్ల కాలంలో కాళేశ్వరం ద్వారా కొండపోచమ్మ ప్రాజెక్టును పూర్తి చేశాము త్రాగునిరు ఎలా ఇచ్చామో సాగునీరు కూడా ప్రతి ఎకరాకు ఇచ్చి తిరుతాం.. రైతులకు బోర్లు వేసే కాలం ఉండదు కాలం అడ్డం పెడితే గోదావరి కాల్వల ద్వారా మీ పొలాల్లోకి నీళ్లు వస్తాయి అని పేర్కొన్నారు.

Related posts