telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మాజీ మంత్రి సోమిరెడ్డికి కరోనా పాజిటివ్

somireddy chandramohan

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్‌ వేదిక ద్వారా తెలిపారు. తనకు కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలిందని.. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌ళో విశ్రాంతి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. “ఈ రోజు నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఆరోగ్యంగానే ఉన్నాను..హోం క్వారంటైన్ లో విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను కలిసినవారందరూ తగు జాగ్రత్తలు తీసుకోగలరు.” అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. కాగా..ఏపీలో గడిచిన 24 గంటల్లో 377 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,83,587 కు చేరింది. ఇందులో 8,73,427 లక్షల మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,038 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో నలుగురు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,122 మంది మృతి చెందారు.

Related posts