telugu navyamedia
తెలంగాణ వార్తలు

కొండాపూర్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా..

జనగామ జిల్లా చిల్పూరు మండలం కొండాపూర్‌లో ఈ రోజు (మంగ‌ళ‌వారం) ఉద‌యం టిఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ తో స‌హా 12 మంది ప్రయాణికులు స‌ల్పంగా గాయ‌లు కాగా సురక్షితంగా ప్రయాణికులు బయటపడ్డారు. హుస్నాబాద్‌ నుంచి జగద్గిరిగుట్టకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పెను ప్రమాదం తప్పడంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

విష‌యం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టారు. ప్ర‌యాణికుల‌ను 108 ద్వారా ఆస్ప‌త్రి త‌ర‌లించారు. బ‌స్సు పూర్తిగా బోల్తా ప‌డి రోడ్డు కింద‌కు ప‌డిపోయిన‌ప్ప‌టికీ ప్రాణాపాయం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో గ్రామ‌స్తులు, ప్ర‌యాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Related posts