telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సాయిధరమ్ తేజ్ కు హీరోయిన్ ఛేంజ్

AIshwarya-Rajesh

మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా ‘ప్రస్థానం’ ఫేం దేవాకట్టా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మొదట ఈ చిత్రంలో తేజ్ సరసన నివేత పేతురాజ్ ను కథానాయకిగా అనుకున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి ‘చిత్రలహరి’లో నటించి అలరించారు. అందుకే వీరిద్దరినీ ఫైనల్ చేశారు. కానీ చివర్లో నివేత స్థానంలో ఐశ్వర్య రాజేష్ ను తీసుకున్నారు. ఈ మార్పు వెనుక కారణాలు తెలియలేదు కానీ మార్పు మాత్రం జరిగిందని తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రాన్ని దేవ కట్ట యాధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు ‘రిపబ్లిక్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ నటిస్తున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో పవర్‌ఫుల్ పొలిటీషియన్ రోల్‌లో రమ్యకృష్ణ కనిపిస్తారట. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ, రమ్యకృష్ణ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.

Related posts