ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ.. మరో వారంలో ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు.
రేపటి నుంచి అన్లైన్ ద్వారా మెమోలు డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. 4 సంస్థల ద్వారా ఫలితాలను సరిపోల్చుకున్నామని వివరించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షకు 1,60,487 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. అందులో 60,600 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులు అయ్యారని తెలిపారు.