telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు సామాజిక

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల విడుదల

telangana intermediate board

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను తెలంగాణ ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ కుమార్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ.. మరో వారంలో ఫస్ట్‌ ఇయర్‌ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు.

రేపటి నుంచి అన్‌లైన్‌ ద్వారా మెమోలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు. 4 సంస్థల ద్వారా ఫలితాలను సరిపోల్చుకున్నామని వివరించారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షకు 1,60,487 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. అందులో 60,600 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులు అయ్యారని తెలిపారు.

Related posts