telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ముంపు ప్రాంతాల్లో ఏపీ గవర్నర్‌ ఏరియల్‌ సర్వే

biswabhusan harichandan governor

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్‌ హరిచందన్‌ శనివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. కృష్ణా నదిలో వరద ప్రవాహం, నీట మునిగిన లంక గ్రామాలను పరిశీలించారు. వరద నివారణ చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వరద పోటెత్తడంతో అధికారులు ఇప్పటికే హై అలర్డ్‌ ప్రకటించారు. వరద నేపథ్యంలో అధికారులు మందుజాగ్రత్తగా సహాయక చర్యలు చేపడుతున్నారు.

కృష్ణా జిల్లాలో 12 మంది గ్రామాలు నీట మునగడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు జిల్లాల్లోనూ ఫైర్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బృందాలుగా ఏర్పడి​ బోట్ల ద్వారా సాయాన్ని అందిస్తున్నారు.వరద ముంపు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలతో పాటు మెడికల్‌ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు.

Related posts