*నేను ఎలాంటి తప్పు చేయలేదు..
*బాలిక సంబంధించిన ఎలాంటి విషయాలు వెల్లడించలేదు..
*పోలీసులు యాక్షన్ బట్టి నా రియాక్షన్ ఉంటుందని అన్నారు
*నేనూ న్యాయవాదినే ..నాకూ చట్టం తెలుసు
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసుకు సంబంధించి ఫోటోలు, వీడియోలు బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై పోలీసులు కేసు నమోదు అయ్యింది.
దీనిపై స్పందించిన రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.. బాలిక సంబంధించిన ఎలాంటి ఫోటోగాని , వీడియో గానీ వెల్లడించలేదని అన్నారు. చట్టం తెలిసిన వాడిగా సాక్ష్యాలను మాత్రమే బయట పెట్టినట్లు తెలిపారు
కాంగ్రెస్ పార్టీ నాపై కావాలనే బురద జల్లుతుందని అన్నారు. సహజమిత్రులైన ఎంఐఎంను కాపాడేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నోటీసులు ఇచ్చినా, అరెస్ట్ చేసినా చట్ట ప్రకారం ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నానని చెప్పారు. తనకు కేసులు కొత్త కాదని అన్నారు.
దిశ ఎన్కౌంటర్ తర్వాత చనిపోయిన బాధితురాలి పేరు పోటో పేపర్లు వేశారు. పోలీసులు అధికారులు కూడా పేరును ప్రస్తావించారు. నాలుగు రోజుల తర్వాత దిశగా నామాకరణం చేశారు. మరి అప్పుడేందుకు కేసులు కాలేదు?. దిశ కేసులో ఎన్కౌంటర్ అయ్యాక.. మైనర్ల ఫొటోలు పేపర్లు, టీవీలలో ప్రచారం చేశారు. ఆ రోజులు రానిని 228-ఏ.. ఇప్పుడేందుకు వచ్చాయి.. అంటే పేదవాడికి ఒక న్యాయం డబ్బు ఉన్నవాడికి ఒక న్యాయమా అని రఘునందన్ ప్రశ్నించారు.
కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం కలసి రాజకీయంగా నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. బాధితురాలి పక్షాన నిలబడతానని, బాధితురాలికు న్యాయం చేయటమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు.
వారి త్యాగాల ఫలితమే బీజేపీ : బండి