నందమూరి హరికృష్ణ కుమార్తె, తెలుగుదేశం నాయకురాలైన నందమూరి సుహాసినికి పార్టీలో కీలక పదవి లభించింది. తెలంగాణలో తన ఉనికిని చాటుకోవడానికి పట్టుదలగా ప్రయత్నిస్తున్న టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాష్ట్ర కమిటీ విస్తరణలో ముగ్గురికి స్థానం కల్పించారు.
రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసిని (కూకట్ పల్లి నియోజకవర్గం), రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుధాకర్ నాయుడు (కొల్లాపూర్ నియోజకవర్గం), రాష్ట్ర కార్యదర్శిగా బీ విఠల్ (బాన్సువాడ నియోజకవర్గం) నియమితులయ్యారు. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా షకీలా రెడ్డి (ఖైరతాబాద్), జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా కరాటే రమేష్ ను నియమిస్తూ కాసాని జ్ఞానేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు.