జీహెచ్ఎంసీ ఎన్నికలపై క్లారిటీ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితా ఈ నెల 13న రానుంది. నవంబర్ 13 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి తెలిపారు. జీహెచ్ఎంసీలో 150 వార్డులు, 30 సర్కిళ్లు ఉన్నాయని..ప్రతి సర్కిల్కు ఒక డిప్యూటీ కమిషనర్ ఉన్నారని వెల్లడించారు. 150 డివిజన్లకు 150 మంది ఆర్ఓలను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి వార్డుకు సగటున 50 పోలింగ్ కేంద్రాలు ఉంటాయని వెల్లండిచారు.
కాగా..గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ను బ్యాలెట్ బాక్సుల ద్వారా నిర్వహించాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించడంతో 30 వేల బ్యాలెట్ బాక్సులు అవసరమవుతాయని అంచనా వేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రకటించిన స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ లోని వివిధ జిల్లాల నుంచి 30 వేల బ్యాలెట్ బ్యాక్సులను పంపినట్లు తెలిపారు. ఆ బ్యాలెట్ బ్యాక్సులనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వాడనున్నారని సమాచారం.
చంద్రబాబుకు పవన్ పార్ట్నర్: వైఎస్ జగన్