telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తిరుమలలో బ్రేక్ దర్శనాలతో సామాన్యులు ఇబ్బంది: రోజా

Nagari TDP Ticket Gali Brothers

బ్రేక్ దర్శనాలను రద్దుచేస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ నేత, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా స్వాగతించారు. బ్రేక్ దర్శనాల పై ఆమె మాట్లాడుతూ గతంలో బ్రేక్ దర్శనాల పేరుతో తిరుమల పుణ్యక్షేత్రంలో వ్యాపారం చేశారని మండిపడ్డారు. తిరుమలలో ఎల్1, ఎల్2, ఎల్3 బ్రేక్ దర్శనాలతో సామాన్యులు ఇబ్బందులకు గురయ్యారన్నారు.

చాలా కొద్దిమందికి మాత్రమే బ్రేక్ దర్శనం అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇక రాష్ట వార్షిక బడ్జెట్ పై స్పందిస్తూ బడ్జెట్ లో రైతులకు, వ్యవసాయరంగానికి పెద్దపీట వేశారని చెప్పారు. రుణమాఫీ, వడ్డీలేని రుణాలు ఇవ్వడం పై ప్రశంసించారు.

Related posts