పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల లాంగ్ మార్చ్ నిర్వహించిన సంగతీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ స్పీచ్ చంద్రబాబుకు కూడా నచ్చలేదట. చంద్రబాబు మొదటి నుంచి వైసీపీ ఇసుక మాఫియా చెలరేగుతుందని ఆరోపించారు. కానీ పవన్ కళ్యాణ్ స్పీచ్ లో ఎక్కడ కూడా వైసీపీ ఇసుక మాఫియా గురించి మాట్లాడిన ధాఖలు లేవు. దీనితో సహజంగానే బాబు చెబుతున్నట్టు పవన్ చెప్పకపోవడంతో బాబు గారికి ఒకింత అసంతృప్తి వచ్చింది. స్థూలంగా కూడా పవన్ కల్యాణ్ ప్రసంగం చంద్రబాబును కూడా మెప్పించలేదట. అందుకు కారణం ఏమిటంటే.. ఇసుక కొరతకు వరదలు కారణం కాదని, శాండ్ మాఫియా అని టీడీపీ వాదన.
ఆ పాయింట్ కూడా మర్చిపోయి మైకు దొరకగానే ఇష్టానుసారంగా మాట్లాడి అసలు కంటే అనవసరమైనవే ఎక్కువ మాట్లాడాడని పవన్ పై బాబు అసంతృప్తిగా ఉన్నారట. ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక కొరత మాఫియా పని అని చంద్రబాబు నాయుడు వాదిస్తూ ఉన్నారు. పవన్ ఆ వాదనను వినిపించలేదు. శాండ్ మాఫియా ఊసే ఎత్తలేదు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్నట్టుగా టాక్. ఇచ్చిన స్క్రిప్ట్ సరిగా చెప్పలేనివాడు, సినిమాలలో ఎలా మేనేజ్ చేస్తున్నాడో అంటూ తలపట్టుకుంటున్నాడట బాబు!
హుజూరాబాద్ ప్రజల చేతిలో తెలంగాణ ప్రజల భవిష్యత్: రేవంత్