మబ్బుల వల్ల సూర్యగ్రహణాన్ని చూడలేకపోయినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ రోజు ఉదయం 8.08 గంటలకు ప్రారంభమైన గ్రహణం.. ఉదయం11.11 గంటలకు ముగిసింది. ఈ సమయంలో సూర్యుడు సప్తవర్ణాలతో కనువిందు చేశాడు. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా విద్యార్థులు, చిన్నారులు, ప్రముఖులు ఆసక్తి కనబరిచారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం సూర్య గ్రహణాన్ని చూడలేకపోయానని తెలిపారు.
ఆకాశంలో మబ్బులు ఉండటం వల్ల గ్రహణాన్ని వీక్షించే అవకాశం లేకుండా పోయిందని ట్విటర్లో వెల్లడించారు. కానీ కేరళలోని కోజికోడ్ నుంచి ప్రత్యక్ష ప్రసారం అయిన దృశ్యాలను చూసినట్లు మోదీ తెలిపారు. నిపుణులతో గ్రహణం గురించి చర్చించడం వల్ల ఆ అంశంపై తన అవగాహన మరింత పెరిగిందని మోదీ తన ట్విట్టర్లో తెలిపారు.