telugu navyamedia
రాజకీయ వార్తలు

జల వివాదం సృష్టించేందుకు కొన్ని పార్టీల యత్నం: మంత్రి అనిల్

minister anil kumar

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి తరలింపు కోసం కొత్త ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్ననిర్ణయంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై న్యాయపోరాటం చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. ఏపీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని మంత్రి హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ అంశంపై స్పందించారు.

ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం సృష్టించేందుకు కొన్ని పార్టీలు యత్నిస్తున్నాయని అనిల్ ఆరోపించారు. సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో కొత్త ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి తీసుకునే నీటి పరిమాణాన్ని పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. కృష్ణా నీటి కేటాయింపులను బోర్డు నిర్ణయిస్తుందన్నారు. బోర్డు నిర్ణయించిన పరిధిలోనే ఇరు రాష్ట్రాలు నీటిని వాడుకుంటాయని చెప్పారు.

Related posts