చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి పేరు వింటేనే ప్రజలందరూ బెంబెలేత్తుతున్నారు. మన ఇండియాలో కరోనా వైరస్ రోజు రోజు విజృంభిస్తోంది. ఇవాళ దాదాపు లక్ష కరోనా కేసులు నమోదవడం అందోళన కలిగించే అంశం. ఈ వైరస్ చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరికీ సోకుతోంది. ఈ వైరస్ ప్రభావం ఐపీఎల్పై బాగా పడుతోంది. ఇప్పటికే పలుగురు ఆటగాళ్లు కరోనా బారీన పడగా తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్ తగిలింది. ఆ టీం ఎమర్జింగ్ ప్లేయర్, విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారించిన దేవ్దత్ పడిక్కల్ కూడా కరోనా బారీన పడ్డాడు. ఈ సారి బెంగళూరు టీం అతనిపై భారీ ఆశలే పెట్టుకుంది. గతేడాది టోర్నీలోనూ పడిక్కల్ నిలకడగా రాణించాడు. ఈ మధ్యే ముగిసిన విజయ్ హజారే ట్రోపీలో 737 పరుగులతో టోర్నీలో రెండో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక టోర్నీ తొలి మ్యాచ్కు కేవలం ఐదు రోజు సమయం మాత్రమే ఉన్న ఈ సమయంలో పడిక్కల్ కు కరోనా సోకడం అందరినీ షాక్కు గురిచేస్తోంది. కాగా.. ఈ నెల 9 నుండి ఐపీఎల్ 2021 ప్రారంభం కానుంది.
రాహుల్ అలా చేసి ఉండకూడదు… పబ్ దాడిపై యాంకర్ వ్యాఖ్యలు