telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2021… కోహ్లీ సేనకు షాక్

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి పేరు వింటేనే ప్రజలందరూ బెంబెలేత్తుతున్నారు. మన ఇండియాలో కరోనా వైరస్‌ రోజు రోజు విజృంభిస్తోంది. ఇవాళ దాదాపు లక్ష కరోనా కేసులు నమోదవడం అందోళన కలిగించే అంశం. ఈ వైరస్‌ చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరికీ సోకుతోంది. ఈ వైరస్‌ ప్రభావం ఐపీఎల్‌పై బాగా పడుతోంది. ఇప్పటికే పలుగురు ఆటగాళ్లు కరోనా బారీన పడగా తాజాగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు షాక్‌ తగిలింది. ఆ టీం ఎమర్జింగ్‌ ప్లేయర్‌, విజయ్‌ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారించిన దేవ్‌దత్‌ పడిక్కల్‌ కూడా కరోనా బారీన పడ్డాడు. ఈ సారి బెంగళూరు టీం అతనిపై భారీ ఆశలే పెట్టుకుంది. గతేడాది టోర్నీలోనూ పడిక్కల్‌ నిలకడగా రాణించాడు. ఈ మధ్యే ముగిసిన విజయ్‌ హజారే ట్రోపీలో 737 పరుగులతో టోర్నీలో రెండో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక టోర్నీ తొలి మ్యాచ్‌కు కేవలం ఐదు రోజు సమయం మాత్రమే ఉన్న ఈ సమయంలో పడిక్కల్‌ కు కరోనా సోకడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. కాగా.. ఈ నెల 9 నుండి ఐపీఎల్ 2021 ప్రారంభం కానుంది.

Related posts