telugu navyamedia
రాజకీయ వార్తలు

16న కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం.. నేతలెవరినీ పిలవడం లేదు: ఆప్

aap party

ఈ నెల 16న ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల లీడర్లెవరినీ ఆహ్వానించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. ఆప్ ఢిల్లీ విభాగం కన్వీనర్ గోపాల్ రాయ్ గురువారం ఈ వివరాలు వెల్లడించారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు.

కేజ్రీవాల్ నాయకత్వంపై నమ్మకం ఉంచి, ఆప్ కు ఘన విజయం అందించిన ఢిల్లీ ప్రజలందరినీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల నేతలెవరినీ కూడా ఈ కార్యక్రమానికి పిలవడం లేదని చెప్పారు. కేవలం ఢిల్లీ కేంద్రంగానే ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

Related posts