telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాహుల్ అలా చేసి ఉండకూడదు… పబ్ దాడిపై యాంకర్ వ్యాఖ్యలు

Rahul

బిగ్‌బాస్ విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై మొన్న పబ్‌లో జరిగిన ఎటాక్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. వికారాబాద్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రిషిత్ రెడ్డి తన ఫ్రెండ్స్‌తో కలిసి మొన్న గచ్చిబౌలిలోని ప్రిస్మ్ పబ్‌కు వెళ్లారు. అదే రోజున రాహుల్ తన ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో రాహుల్‌తో పాటు ఉన్న ఇద్దరు యాంకర్లతో రిషిత్ రెడ్డి అతని ఫ్రెండ్స్ అసభ్యకరంగా ప్రవర్తించాడట. ప్రశ్నించినందుకు రిషిత్ రాహుల్‌పై బీర్ బాటిల్స్‌తో దాడి చేసారు. దాంతో రాహుల్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆ తర్వాత మరుసటి రోజు రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ ఘటనపై ప్రముఖ యాంకర్, బీజేపీ నేత శ్వేతా రెడ్డి స్పందించారు. జరిగిన దాంట్లో రాహుల్‌ది కూడా తప్పు ఉందని అన్నారు. ‘‘మొన్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై పబ్‌లో జరిగిన ఘటన గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఎవ్వరికీ సపోర్ట్ చేయడంలేదు. కానీ రాహుల్ విషయంలో నాకు ఒకటి నచ్చలేదు. మొన్న మీడియా మిత్రులు మీరు పబ్‌కి ఎందుకు వెళ్లారు అని అడిగితే.. మీరు వెళ్లరా అని ఎదురు ప్రశ్న వేసారు. అది చాలా తప్పు. బిగ్‌బాస్ విన్నర్, సింగర్ అంటే ఎంతో పేరు ఉంటుంది. సెలబ్రిటీ కాబట్టే మీడియా వాళ్లు ఆ ప్రశ్న అడిగారు. దానికి రాహుల్ అలా ఎదురు ప్రశ్న వేయడం కరెక్ట్ కాదు. ఇక ఈ పబ్ కల్చర్ గురించి చెప్పాలంటే.. అది అసలు మన తెలుగు కల్చరే కాదు. నగరం నిద్రపోతున్న వేళ పబ్‌లు తెరుచుకుంటాయి. డ్రగ్స్, మద్యం, డీజే, మసక మసక చీకట్లో మల్లెతోట వెనకాల అన్నట్లు అక్కడ జరిగే పనుల గురించి రోజూ చూస్తూనే ఉన్నారు. అసలు పబ్బుల్లో ఏం జరుగుతుంది అని తెలుసుకునేందుకు మా టీం మొత్తం వెళ్లాం. అక్కడ జరిగేవి చూసి షాకింగ్ అనిపించేలా ఉన్నాయి. రోజూ ఆడపిల్లలపై సురక్షిత ప్రదేశాల్లోనే జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తూనే ఉన్నారు. అలాంటిది పబ్‌లాంటి అభద్రతా స్థలాలకు అమ్మాయిలను తీసుకెళ్లడం ఎందుకు? ఇక పబ్బుల్లో ఆడపిల్లల ప్రవర్తన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు దుస్తులు ఉన్నాయా లేవా అన్నట్లుగా వేసుకుంటారు. పైగా డ్రగ్స్ తీసుకోవడంతో ఊగిపోతుంటారు. వాళ్లపై అబ్బాయిలు చేతులు వేసేది కూడా తెలీదు. సోయ లేకుండా ప్రవర్తిస్తుంటారు. అంతెందుకు తాగేసి విచ్చలవిడిగా డ్రైవింగులు చేసుకుంటూ పోలీసులకు చుక్కలు చూపించిన లేడీస్‌ని ఎంత మందిని చూడలేదు. అందుకే పబ్బులను, క్లబ్‌లను తెలుగు రాష్ట్రల్లో నిషేధించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సీపీ సజ్జనార్‌ని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

Related posts