ఇటీవల బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఎన్నార్సీ జాబితాలో చోటు దక్కని ముస్లింలను నిర్బంధ కేంద్రాలకు పంపుతారంటూ ప్రతిపక్షాలు వదంతులు వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపణలు చేశారు. సీఏఏ, ఎన్నార్సీలపై ఆ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ప్రధాని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. మోదీ అబద్ధాలు చెబుతున్నారంటూ విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలో రాహుల్ ట్విట్టర్ మాధ్యమంగా స్పందించారు. ‘మోదీ భారతమాతకే అబద్ధాలు చెబుతున్నారు’ అని కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో పాటు అసోంలో నిర్మాణ దశలో ఉన్నట్లుగా చెబుతున్న ఓ నిర్బంధ కేంద్రం దృశ్యాలు, ఢిల్లీ సభలో మోదీ చేసిన విమర్శలకు సంబంధించిన దృశ్యాలతో కూడిన ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
కర్ణాటకలో 300 మంది ఫోన్ల ట్యాప్: ఎంపీ సుమలత