telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జనసేన ఆఫీస్ లో క్యూ .. ఒక్కరోజే 265 దరఖాస్తులు!

Janasena pawan comments Jagan

 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయ పార్టీల్లో వలసలు మొదలయ్యాయి. పార్టీలు మారుతూ టికెట్ ల కోసం ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.తాజాగా అమరావతిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం ముందు ఆశావహులైన నేతలు క్యూ కడుతున్నారు. విద్యావంతులు, మహిళలు స్క్రీనింగ్ కమిటీ ముందు హాజరై ఎన్నికల్లో పోటీ కోసం తమ దరఖాస్తులను సమర్పిస్తున్నారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈరోజు మొత్తం 265 దరఖాస్తులు వచ్చాయి. స్క్రీనింగ్ కమిటీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన బయోడేటాతో కూడిన తొలి దరఖాస్తును సమర్పించారు. ఆయన తర్వాత మరో నేత మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిన్న తెనాలి నుంచి జనసేన అభ్యర్థిత్వం కోరుతూ తమ దరఖాస్తును సమర్పించారు.

Related posts