telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మంత్రిని చేస్తానని కేసీఆర్ మాట తప్పారు.. నాయిని సంచలన వ్యాఖ్యలు

nayini Trs telangna

టీఆర్ఎస్ నేత, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హోంమంత్రిగా పని చేసిన తనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఎందుకని ప్రశ్నించారు. తనకు ఏ కార్పోరేషన్ పదవి వద్దని తేల్చి చెప్పారు. టీఆర్ఎస్‌కు తాను కూడ ఓనర్‌నేనని ఆయన చెప్పారు. కిరాయికి వచ్చిన వాళ్లు ఎప్పుడు దిగిపోతారో తెలియదన్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముషీరాబాద్ టికెట్ ను తన అల్లుడికి ఇవ్వాలని సీఎం కేసీఆర్ వద్ద నాయిని నర్సింహరెడ్డి టిక్కెట్టు ఇవ్వాలని కోరారు. కానీ ఆ సీటును ముషీరాబాద్ అసెంబ్లీ సీటును టీడీపీ నుండి టీఆర్ఎస్‌లో చేరిన ముఠా గోపాల్ కు ఇచ్చారు. ముఠా గోపాల్ ను గెలిపించుకునిరా, తనను మంత్రిని చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చారని… ఇప్పుడు ఆ మాట తప్పారని నాయిని మండిపడ్డారు.

Related posts