హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులను టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు తమ పరిధి కాదని చెప్పడం సరికాదన్నారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం శోచనీయమని అన్నారు.
పోలీస్శాఖను రాజకీయ అస్త్రంగా ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. తెలంగాణ హోంమంత్రికి టోపీ లేదని, లాఠీ లేదు.. ఆ అధికారాలన్నీ మరో మంత్రి తీసుకున్నారని ఎద్దేవాచేశారు. సమాజంలో మహిళల పట్ల చులకనభావం పోవాలన్నారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనల్లో సత్వర న్యాయం జరగాలని కోరారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.