ఏపీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సుమారు అరగంటకుపైగా పలు విషయాలపై మాట్లాడారు. నవరత్నాలు తూచ తప్పకుండా పాటిస్తానని జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని వృద్ధులకు రూ.2250 నెలకు పెన్షన్ కింద ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరంపెన్షన్పై మొదటి సంతకం పెట్టారు. ఈ సందర్భంగా తనను అఖండ మెజార్టీతో గెలిపించి సీఎంను చేసిన ప్రజలనుద్దేశించి జగన్ ప్రసంగించారు.
. నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. ఆశీర్వదించిన దేవుడికి, నాన్నగారికి, నా తల్లికి పాదాభివందనం చేస్తూ మీ అందరికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానని తన ప్రసంగం ముగించారు.