telugu navyamedia
క్రీడలు వార్తలు

టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన నటరాజన్…

ప్రస్తుతం టీం ఇండియా ఆసీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో గాయపడ్డ ఫాస్ట్ బౌలర్‌ ఉమేశ్ యాదవ్ స్థానాన్ని నటరాజన్ భర్తీ చేయనున్నాడు. ఆస్ట్రేలియాతో భారత్ ఇంకా రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. అయితే, మొదటి టెస్టులో ప్రధాన పేసర్ మహ్మద్ షమీ గాయంతో సిరీస్ మొత్తానికి దూరం కాగా, రెండో టెస్టు ఉమేశ్ గాయపడ్డాడు. దీంతో షమీ స్థానంలో ఇప్పటికే ముంబయి పేసర్ శార్దూల్ ఠాకూర్ ను జట్టులో చేర్చిన సెలెక్టర్లు, ఉమేశ్ స్థానంలో తమిళనాడు లెఫ్టార్మ్ సీమర్ టి.నటరాజన్‌ను జట్టులోకి ఎంపిక చేశారు. ఇటీవలే పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా జట్టులో స్థానం సంపాదించిన నటరాజన్… అద్భుతంగా రాణిస్తున్నాడు. దీంతో టెస్టు జట్టులోకి కూడా అతను ఎంపికయ్యాడు.  14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ కూడా జట్టుతో కలిశాడు. ఆస్ట్రేలియా టూర్లో ఇంత వరకూ ఇరు జట్లు చెరో మ్యాచ్‌ గెలిచి, సమ ఉజ్జీలుగా ఉన్నాయి. ఈ నెల 7 నుంచి సిడ్నీలో మూడో టెస్టు జరగనుంది. ఇందులో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి మరి.

Related posts