కరోనా కట్టడిలో తెలంగా సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు. సీఎం కేసీఆర్ విధానాలనే కేంద్రం అమలు చేస్తోందని చెప్పారు. హన్మకొండ చౌరస్తాలో కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చర్మకారులకు ఆయన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ పేదలను ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. కడియం ఫౌండేషన్ ద్వారా వెయ్యి మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని తెలిపారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ది రాజకీయ డ్రామా అని కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు.