telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఒవైసీకి కేసీఆర్ భయపడుతున్నారు: అమిత్ షా

TDP Mla anitha comments Roja YCP

ఎంఐఎం అధినేత ఒవైసీకి తెలంగాణ సీఎం కేసీఆర్ భయపడుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఎంఐఎం అధినేత ఒవైసీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా కేసీఆర్ ఇంత వరకు జరపలేదని అమిత్ షా విమర్శించారు. రజాకార్ల పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగించాలని అన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని కేసీఆర్ అడుగుతున్నారని, ఈ ఐదేళ్లలో తెలంగాణకు మోదీ ప్రభుత్వం రూ. 2.35 లక్షల కోట్లను ఇచ్చిందన్నారు.

కేసీఆర్ కూడా చిన్నా చితకా పార్టీలను కలుపుకుపోతామని అంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఒక కుటుంబ పార్టీ అని, టీఆర్ఎస్ లో నెంబర్ టూ ఎవరనేది ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు.పాక్ నుంచి ఒక్క బులెట్ వస్తే, వారిపై బులెట్ల వర్షం కురిపిస్తామని చెప్పారు. కేసీఆర్ లాంటి వారు పాకిస్థాన్ కు సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు.

Related posts