2020 మే 1వ తేదీ లేదా 5న అంధుల కోసం శ్రీ అష్టోత్తర శత 108 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దర్శన భాగ్యం కల్పిస్తున్నామని ట్రస్టు చైర్మన్. డాక్టర్ వేణుకుమార్ చుక్కల తెలిపారు. నేరేడ్మెట్ డివిజన్ యాప్రాల్ మెహెర్బాబా కాలనీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.
ఆసక్తి ఉన్నవారు సంప్రదించి పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు. ఎంపిక చేసుకున్న వారికి రానుపోను చార్జీలు, భోజనం, వసతి, దర్శనం అన్ని ఉచితంగా అందించి దర్శనం కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు మేనేజర్ వసంతకుమార్ను 9666159999 సంప్రదించాలని డాక్టర్ వేణుకుమార్ చుక్కల తెలిపారు.