telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా టీకా వేయించుకున్న మహేష్‌బాబు వదిన

కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజు వేల సంఖ్యలో పెరిగిపోతున్న కేసుల కారణంగా ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చేసిందని కొన్న కంపెనీలు ఇంతకుమందు ప్రకటించినా అవి పనిచేయలేదు. అయితే ఇటీవల దీనికి వ్యాక్సిన్ వచ్చేసిందని పలుదేశాలు తెలిపాయి. యూఏఈలో కరోనా టీకాలను కూడా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో ఉంటున్న బాలీవుడ్ నటి ఈ టీకాను వేయించుకున్నారు. ఆ నటి ఎవరో కాదండీ.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ వదిన శిల్ప శిరోదర్కర్. నమ్రత శిరోద్కర్ సోదరి. ఈ విషయాన్ని శిల్ప శిరోద్కర్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. ఈ టీకాలు వేసుకోవడం సురక్షితమని, వాటి ద్వారా మనం మళ్లీ సాధారణ జీవనాన్ని కొనసాగించవచ్చని తెలిపింది. అంతేకాకుండా తనకు టీకా అందించినందుకు యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపింది. కరోనా టీకా అందుకున్న మొట్టమొదటి బాలీవుడ్ నటి శిల్ప కావడం విశేషం. శిల్ప చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కి సోదరి నమ్రతా వెంటనే రియాక్ట్ అయింది. అంతేకాకుండా సింపుల్‌గా గుడ్ గర్ల్ అంటూ కామెంట్ చేసింది. శిల్పా సినీ జీవితానికి గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తోంది.

Related posts