telugu navyamedia
సినిమా వార్తలు

“చిత్రలహరి” సెన్సార్ పూర్తి

Chitralahari

సుప్రీమ్‌ హీరో సాయి తేజ్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘చిత్రలహరి’. నివేదా పేతురాజ్‌, కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్స్‌. ఏప్రిల్‌ 12న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో థియేట్రికల్‌ ట్రైలర్‌ను కొరటాల శివ, సుకుమార్‌ విడుదల చేశారు. ఈ సినిమా టీజర్ కు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే లభిస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు క్లీన్ “యు” సర్టిఫికేట్ లభించింది. ఎక్కడా ఒక కత్తెర కూడా పడకుండా ఈ సినిమా బయటికి రావడం విశేషం. నివేదా పేతురాజ్ మరో కథానాయికగా నటించిన ఈ సినిమాలో సునీల్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాతో కమెడియన్ గా సునీల్ మళ్లీ బిజీ కావడం ఖాయమని అంటున్నారు. ఇక ఈ సినిమా హిట్ సాయితేజ్ కి మాత్రమే కాకుండా కల్యాణి ప్రియదర్శన్ కి కూడా చాలా ముఖ్యం.

Related posts