సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘చిత్రలహరి’. నివేదా పేతురాజ్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్. ఏప్రిల్ 12న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో థియేట్రికల్ ట్రైలర్ను కొరటాల శివ, సుకుమార్ విడుదల చేశారు. ఈ సినిమా టీజర్ కు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే లభిస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు క్లీన్ “యు” సర్టిఫికేట్ లభించింది. ఎక్కడా ఒక కత్తెర కూడా పడకుండా ఈ సినిమా బయటికి రావడం విశేషం. నివేదా పేతురాజ్ మరో కథానాయికగా నటించిన ఈ సినిమాలో సునీల్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాతో కమెడియన్ గా సునీల్ మళ్లీ బిజీ కావడం ఖాయమని అంటున్నారు. ఇక ఈ సినిమా హిట్ సాయితేజ్ కి మాత్రమే కాకుండా కల్యాణి ప్రియదర్శన్ కి కూడా చాలా ముఖ్యం.
#ChitralahariOnApr12th
Censored with Clean U and Zero Cuts@IamSaiDharamTej @kalyanipriyan #Nivetha @Mee_Sunil @vennelakishore @ThisIsDSP #KishoreTirumala @MythriOfficial pic.twitter.com/0d3y6fTBXT— BARaju (@baraju_SuperHit) April 8, 2019