telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బ్యాంకర్లతో సీఎం జగన్ సమావేశం

jagan

ఏపీ సీఎం జగన్ నేడు రాష్ట్ర సచివాలయంలో రుణ ప్రణాళికల విషయమై బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2019 – 20కి గాను రాష్ట్ర రుణ ప్రణాళికను జగన్ ఆవిష్కరించారు. రైతులతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఏర్పాటుకు ముందుకొచ్చే ఔత్సాహికులకు, డ్వాక్రా మహిళలు, వివిధ రంగాల వారికి సంబంధించిన రుణ ప్రణాళికల విషయమై ఈ సమావేశంలో జగన్ ముఖ్యంగా చర్చించారు.

ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లంతో పాటు రాష్ట్ర బ్యాంకర్ల సంఘం అధ్యక్షుడు ఎస్.దాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts