నిన్న సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ 32 పరుగులు చేశాడు. అందులో అతడు రెండు సిక్సర్లు బాదాడు. దీంతో ఐపీఎల్లో రోహిత్ మొత్తం సిక్సర్ల సంఖ్య 217కు చేరింది. దాంతో ఐపీఎల్లో అత్యధిక సిక్స్లు కొట్టిన భారత ఆటగాడిగా ఎంఎస్ ధోనీ (216) పేరు మీద ఉన్న రికార్డును రోహిత్ శర్మ శనివారం బద్ధలు కొట్టాడు. కానీ ఓవరాల్గా ఐపీఎల్లో అత్యధిక సిక్స్లు బాదింది మాత్రం విండీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్. గేల్ 351 సిక్సులు బాదాడు. గేల్ తర్వాత మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ (237) ఉన్నాడు. ధోనీ, రోహిత్ తర్వాత విరాట్ కోహ్లీ (201), సురేష్ రైనా (198) ఉన్నారు. ఇక కెప్టెన్గా టీ20ల్లో 4 వేల పరుగుల రికార్డును కూడా ఇదే మ్యాచ్తో రోహిత్ అందుకున్నాడు. అయితే నిన్నటి మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 13 పరుగుల తేడాతో రోహిత్ సేన విజయం సాధించింది.
previous post
next post