telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ముంబయిలో తన వాదనలు వినిపించిన చంద్రబాబు

Chandrababu comments Jagan cases

ముంబయి అఖిలపక్ష సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీకీ వ్యతిరేకంగా మాట్లాడితే ఐటీ, ఈడీ, సీబీఐ వంటి రాజ్యాంగ సంస్థలతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. చివరికి విపక్ష నేతల ఇళ్లలో కూడా దాడులు చేయిస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో జరిగిన ఎన్నికల గురించి తన వాదనలు వినిపించారు. ఈవీఎం లోపాలు, ఈసీ వైఫల్యాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు.

ఏపీలో ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో 2 నుంచి 6 గంటల పాటు ఈవీఎంలు మొరాయించాయని తెలిపారు. చివరికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కూడా ఓటు వేయలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఈవీఎం మొరాయించడంతో ఆయన సైతం వెనుదిరగాల్సి వచ్చిందని తెలిపారు. పోలింగ్ ఏర్పాట్లు చేయడంలో ఈసీ విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు. ఈవీఎంలలో లోపాలు వస్తే సరిదిద్దేందుకు తగిన సిబ్బంది లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు సరైన విధానం కాదని చాలా దేశాలు గుర్తించాయని పేర్కొన్నారు.

Related posts