భారత యువ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్ జోడి మధ్య ఓవర్లలో పరుగులు కట్టడిచేస్తూ.. వికెట్లు తీసి ప్రత్యర్ధిని ఒత్తిడిలోకి నెట్టేవారు. కానీ ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లో ఈ జోడి కలిసి ఆడేందుకు అవకాశం రావడం లేదు. కుల్దీప్, చహల్ కలిసి 2019 జూన్లో చివరిసారి ఆడారు. అయితే స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కారణంగానే తామిద్దరం కలిస్ ఆడే ఛాన్స్ రావడం లేదని అంటున్నాడు చహల్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యుజ్వేంద్ర చహల్ మాట్లాడుతూ. కుల్దీప్ యాదవ్తో కలిసి ఆడిపోవడానికి కారణం ఏమిటని చహల్ను ప్రశ్నించగా.. రవీంద్ర జడేజానే అసలు కారణం అన్నాడు. ఒకవేళ జడేజా మీడియం పేసర్ అయ్యుంటే.. యాదవ్తో తన భాగస్వామ్యం కొనసాగి ఉండేదన్నాడు. హార్దిక్ పాండ్యా ఉన్నపుడు.. తామిద్దరం జట్టులో ఉన్నామని యూజీ పేర్కొన్నాడు. అయితే తాము కలిసి ఆడటం కన్నా జట్టు కూర్పే ప్రధానమన్నాడు చహల్.
previous post
తెలంగాణలో దళితులకు రక్షణ లేదు: మందకృష్ణ