ఏపీ రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనకు నిరసన సెగలు తగులుతున్నాయి. చంద్రబాబు కాన్వాయి పై దుండగులు రాళ్లు రువ్వడం, చెప్పులు విసరడం వంటి చర్యలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ నేతలే తమపై దాడులకు దిగారంటూ కొందరు వ్యక్తులు ఆందోళన చేపట్టారు. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే, చంద్రబాబు గుంటూరు, విజయవాడ ప్రాంతాల నుంచి గూండాలను తీసుకువచ్చి దాడులు చేయించారని వారు ఆరోపిస్తున్నారు. రాజధానికి తాము కూడా భూములు ఇచ్చామని, భూములు ఇచ్చినందుకు ప్రతిఫలంగా దాడులు చేయిస్తారా? అని చంద్రబాబుపై మండిపడ్డారు.
యురేనియం తవ్వకాలపై ఎవరికీ అనుమతి ఇవ్వలేదు: సీఎం కేసీఆర్